
★ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బీఎఫ్హెచ్ఐ అవార్డ్
పుట్టిన పసిబిడ్డ నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ఇచ్చే బీఎఫ్హెచ్ఐ అ్రకిడేషన్ సర్టిఫికెట్ ఖమ్మం జిల్లా ఆసుపత్రికి వచ్చింది.సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి పువ్వాడ సారధ్యంలో జిల్లా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా రాష్ట్రంలో నవజాత శిశుమరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయి.
