


★మున్నేరు వరదకు శాశ్వత పరిష్కారం చూపిన తెలంగాణ ప్రభుత్వం
◆ఫలించిన మంత్రి పువ్వాడ కృషి
ఖమ్మం మున్నేరు కు రెండు వైపులా RCC కాంక్రీట్ వాల్ నిర్మాణం.ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కృషి.కరకట్ట నిర్మాణ చేపడితే చాలా మంది ఇల్లు కోల్పోవాల్సి వస్తుందని వివరణ. సంతృప్తి చెందిన సిఎం కేసీఅర్.వరదకు శాశ్వత పరిష్కారం మున్నేరుకు RCC కాంక్రీట్ వాల్ నిర్మాణమే అని ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి నివేదించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.నిర్మాణం కోసం రూ.150 కోట్లు మంజూరు చేసిన సిఎం. ఆయా నిర్ణయాన్ని క్యాబినేట్ లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన మంత్రి వర్గం.మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు, ఖమ్మం నగర ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.మున్నేరు బాధితుల కష్టాలు శాశ్వతంగా దూరం చేసిన తెలంగాణ ప్రభుత్వం.
