



Khammam/17.10.2023
PRESS MEET;
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్…
15 వ తేదీన అందరూ బీ ఫాంలు అందుకున్న తర్వాత సమావేశంలో పాల్గొంటున్నాం.
గడచిన 5ఏళ్లు ప్రజలు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చూశారు.
2014, 18 ఎన్నికల లాగా కాకుండా ఇప్పుడు అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం కొనసాగిస్తుంది.
రాష్ట్రంలో అన్ని సర్వేలు, మేధావులు అంతా సీఎంగా కేసిఆర్ గారు మూడవసారి విజయం సాధిస్తారు అని ఇప్పటికే వెల్లడించారు.
సీఎం కెసిఆర్ గారు ఖమ్మం జిల్లా నుండి అత్యధిక సీట్లు గెలిచి బహుమతిగా ఇస్తాం.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసు, ప్రత్యర్థి పార్టీలు వారికి అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి తర్జన భర్జన అవుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలి. అభివృద్ది వైపే నిలవాలి.
ఇతర జిల్లాలతో పాటు ఇతర జిల్లాల కంటే ఎక్కువగా సీఎం కెసిఆర్ గారు ఖమ్మం జిల్లాకు పెద్ద పీట వేశారు.
ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆలోచన చేయాలి. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొదటి సారి 63, రెండవసారి 84 సీట్లు సీఎం కెసిఆర్ గారికి అందించారు.
కాంగ్రెస్ పార్టీ మా కార్యక్రమాలను, హామీలను కాపీ కొట్టింది. మేము కాపీ కొట్టలేదు.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఇచ్చిన పించన్ వందల్లోనే ఇచ్చింది.. దాన్ని వేలు చేసింది సీఎం కేసిఆర్ గారి ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టింది. కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన చెప్పిందే చేస్తారు.
మనం కూడా మన కుటుంబ సభ్యులకు భీమా చేపించం కానీ కేసిఆర్ గారు భీమా అని పెట్టీన సీఎం కెసిఆర్ కు రాష్ట్ర ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.
మంచి ఉంది అంటే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేము తీసుకుంటాం మంచిని మేము విమర్శించం.
మీరు మేనిఫెస్టో లో ప్రవేశపెట్టిన వాటిని మీరు నెరవేర్చలేదు మేము వాటిని నెరవేర్చాం.
చిన్న రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన సీఎం కెసిఆర్ గారు మూడవసారి విజయం అందించే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనా ఉంది.
మా అభ్యర్థులు అందరినీ కారు గుర్తుపై ఓట్ వేసి గెలిపించండి.
▪️ఎంపీ నామా నాగేశ్వరరావు కామెంట్స్…
రేపు జరగబోయే ఎన్నికల్లో ఖమ్మం ప్రజల ఆశీర్వాదం కోసం ఖమ్మం రానున్నారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10 ఏళ్లలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగింది.
సంక్షేమ పథకాల అమలులో కూడా దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది
కేసిఆర్ ను మూడవ సారి సీఎంగా ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారు.
కేసిఆర్ కు పేదలు, రైతులు, కరెంట్, నీటి కష్టాల విలువ తెలుసు కాబట్టి గొప్ప గొప్ప పథకాలు రాష్ట్రానికి అందించారు.
సీఎం కెసిఆర్ గారు ప్రవేశ పెట్టిన పథకాలను పలు రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొట్టాయి.
ఇప్పటికే దేశంలో కరెంట్ విషయంలో పర్ క్యపిటా లో మనమే నంబర్ వన్.
కొన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, ఆ ఆలోచన కూడా ఇతర రాష్ట్రాల సీఎంలకు రావు.
గత 10 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీను మేము చూసి చూపాం, ఇప్పుడు ఇచ్చే హామీలను చేసి చూపుతాం.
60 ఏళ్లలో ఆ పార్టీ ఏమి చేసింది లేదు కానీ ఇప్పుడు ఆ పార్టీ వచ్చి 6 గ్యారెంటీలు అంటుంది.
జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపి వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మేల్యే రాములు నాయక్, BRS అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి), మధన్ లాల్(వైరా), లింగాల కమల్ రాజ్(మధిర), నాయకులు పగడాల నాగరాజు, RJC కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్ ఉన్నారు.
