……పత్రికా ప్రకటన…..
ఈరోజు విజయవాడ సత్యనారాయణ పురం,అబ్బూరి వారి వీధి లో ఉన్న బ్రంహాశ్రి టేకి నరసింహా చార్యులు ఎడ్యుకేషన్ ట్రస్ట్ (దేవాదాయ ధర్మాదాయ శాఖ)విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారి నిర్వహణ లో ఉన్న 367 గజాల స్థలం కొంత కాలంగా ఇతరుల ఆక్రమణ ఉన్న స్థలాన్ని విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు కోర్టు లో గెలిచి ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో స్వాధీన పరిచు కున్నారు స్థలాన్ని పరిశీలించి స్వాధీన పత్రాలు విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి గారికి జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు అందచేశారు
చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థుల కు విధ్యా అభివృద్ధి కోసం మహా విద్యా దాత బ్రంహాశ్రీ టేకి నరసింహ చార్యులు గారు అశ యాలకు అనుగుణంగా త్వరలో నిర్మాణం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ లీగల్ కౌన్సిల్ సభ్యులు యల్. యల్. యన్ గారు,ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ అనురాధ గారు,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కల్లూరి శ్రీవాణి ,రాష్ట్ర నాయకులు కుప్పిలి సత్యనారాయణ,జవ్వాది సుదీర్,నగర సంఘం నాయకులు పేదప్రోలు బ్రాంహం,పాలడుగు శివ,చేబ్రోలు నాగేశ్వరావు, ధ నాలకోట శేఖర్ బాబు,సున్నపు వీరభద్ర చారి,కోసూరి రమేష్,సత్యవతి,బ్రమరాంభా గార్లు తదితరులు పాల్గొన్నారు

ByVNB News

Dec 14, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed