ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రాపర్తి నగర్ 58వ డివిజన్ వివేకానంద కాలనీలో ఉన్న తెలంగాణ స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు ( ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ) స్వగృహానికి విచ్చేసి తేనేటి విందును ఆస్వాదించారు . ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలో వెన్నంటి ఉండి కాపడుకుంటూ వస్తానన్నారు . స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను నగరానికి దూరంగా తరలిస్తానని హామీ ఇచ్చారు . వారి స్వగృహానికి వచ్చిన సందర్భంగా డాక్టర్ కే వి కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . గెలిచిన తర్వాత మమ్మల్ని గుర్తించుకుని ప్రత్యేకంగా మా స్వగృహానికి రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నామన్నారు .ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు , ప్రముఖ వైద్యులు , వివిధ కుల సంఘాల నాయకులు , ప్రజాసంఘాల నాయకులు , మెడికల్ రిప్రజెంట్లు మరియు స్థానిక డివిజన్ వాసులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed