మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమం, స్త్రీ, వైద్య, ఆరోగ్య సమస్యలు, స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాదులు, బ్యాంక్ లింకేజ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల పురోగతి తదితరుల అంశాల పట్ల మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు. మహిళా శక్తి పథకాన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలుపర్చాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల పరిశ్రమలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమ పైన అవగాహన, స్థైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారన్నారు. చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువులు మార్కెట్, ప్రజల డిమాండ్ మేరకు చేయడం ద్వారా విజయం సాధించవచ్చన్నారు. సంఘాలు స్థాపించే చిన్న పరిశ్రమలు పూర్తి నాణ్యత పాటిస్తూ, ఆకర్షణీయమైన ముద్రను రూపొందించుకోవాలన్నారు.

ByVNB News

Jul 30, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed