క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ  ఐ.డి.ఓ.సి. ప్రాంగణంలోని ప్రగతి మీటింగ్ హాల్ లో అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ అధ్యక్షతన జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతోపి.సి.పి.ఎన్‌.డి.టి.యాక్ట్, ఎమ్‌.టి.పి యాక్ట్, బర్త్ & డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆసుపత్రుల నిర్వహణ, వైద్యసేవలు, రోగుల భద్రత, రక్షణ, నిర్వహణ, రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో వైద్య ఆరోగ్య సంబంధిత సేవలను కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు అమలు చేయడానికి,గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం మరియు గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం నకు జిల్లాలో ఛైర్మన్ గా వున్నారని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి స్కానింగ్‌ సెంటర్‌లో నిబంధనలు అమలవుతున్న తీరును నిరంతరం పరిశీలించాలని, గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్దారణ చట్టం-1994, రూల్స్‌-1996 అమలు గురించి ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశవుగా వున్నపుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి చట్ట ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. ఆసుపత్రులలో ‘ఇచట లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు, సేవ్ గర్ల్ చైల్డ్ ‘ పోస్టర్లు అందరికి కనపడే విధంగా ప్రదర్శిస్తున్నారా, లేదా అని పరిశీలించాలని అన్నారు. స్కానింగ్‌ సెంటర్లలో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ వుండాలని, ప్రతినెల జరిగే స్కానింగ్‌ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపించాలని, ఆన్లైన్ పోర్టల్ లో కూడా నమోదు చేయాలనీ, లింగ నిర్ధారణ, పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయేది ఆడ మగ అని చెప్పడం, సంకేతాలు చూపెట్టడం కూడా నేరమని, జిల్లాలో 0-6 సంవత్సరాల వయసు గల ఆడపిల్లల శాతం క్రమక్రమంగా దిగజారిపోతున్నదని, అందుకు నైతిక, సామాజిక బాధ్యత అందరికి వర్తిస్తుందని, ఆసుపత్రుల నిర్వహణలో నాణ్యత, భద్రత, లైసెన్సులు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రత, మొదలైనవి చాలా ముఖ్యమైనవని, ఆసుపత్రులు సరైన ప్రమాణాలతో పనిచేస్తున్నాయా, లేవా, నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు చేపట్టాలని,ఆసుపత్రిలో అందించే వైద్య సేవల నాణ్యతలను,వైద్యుల నైపుణ్యతలను, రోగుల సంరక్షణ, చికిత్సా,ఆసుపత్రికి సరైన లైసెన్సులు ఉన్నాయా,లేవా , ఆసుపత్రికి గుర్తింపు వుందా, లేదా,అగ్నిమాపక భద్రత, వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల భద్రత వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలనీ,ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో నిర్వహించడం, తద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడటం,రోగులకు సరైన చికిత్స అందించడం, వారి భద్రతను నిర్ధారించడం, ప్రమాదాలు జరగకుండా చూడటం,ఫార్మసీలో మందుల నిల్వ, గడువు తేదీలు, సరైన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయా? లేదా? ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్‌లకు సరైన రిజిస్ట్రేషన్ ఉందా, లేదా,వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు, పనితీరును తనిఖీ చేయాలని,ఆసుపత్రి యాజమాన్యం ఈ నియమాలను పాటిస్తూ, లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని, జిల్లాలో 519 హాస్పటల్స్ రిజిస్ట్రేషన్ అయి వున్నాయని, సాధారణ ప్రసవలు జరిగేలా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి ప్రజలకు ఉచిత వైద్య సేవలను శాంతి నిలయం లేదా కర్ణగిరి లలోఅందించాలని,

ByVNB News

Jul 22, 2025

*ఖమ్మం మన జ్యోతి బ్యూరో జులై 22*

ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పారదర్శికంగా వైద్య సేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వెంకటరమణ, డా. చందు నాయక్, డా. రామారావు, డా. సుబ్బారావు, డా. బిందుశ్రీ, డెమో సుబ్రహ్మణ్యం, ఐ.ఎం.ఏ. డాక్టర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed