డిప్యూటీ సీఎం భట్టి ని కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు
ఖమ్మం మార్చి 8 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని , అభినందనలు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యండి. అబ్దుల్ హకీమ్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలుసుకొని , పుష్పగుచ్చాలు అందించి , ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు యం డి. అబ్దుల్ హకీమ్ ఉపముఖ్యమంత్రి భట్టి కు సంఘ సభ్యులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎండి. అబ్దుల్ హకీమ్ తో పాటు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి. పంతులు , అసోసియేటెడ్ అధ్యక్షుడు సుస్వేశ్వర రావు , ముఖ్య సలహాదారుడు ఎం. బాబురావు , జాయింట్ సెక్రటరీ జానీ మియా , ఉపాధ్యక్షులు యండి. రఫీ , పట్టణ అధ్యక్షులు అబ్బు రాములు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు