అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.
ఖమ్మం జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.
రాజ్యాంగ నిర్మాణకర్త DR.BR అంబేడ్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప స్థాయిలో అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ గారి పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.
Zp చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు, కలెక్టర్ గౌతమ్ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, ఎమ్మెల్సీ తాత మధు గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

ByVNB News

Feb 24, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed