జిల్లా కేంద్రంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం కమిషన్ దారులు, రైతులు మధ్య వివాదం నెలకొంది. ఈ వారంలో మార్కెట్ కు అధికంగా మిర్చి బస్తాలు వచ్చాయి. శుక్రవారం ఒక క్వింట మిర్చి ధర రూ. 20,800 ఉండగా శనివారం 20,200 ధర గా నిర్ణయించారు. నాలుగైదు రోజులుగా క్రమంగా రేటు పెరుగుతుండగా శనివారం ధర తగ్గించడంతో స్వల్ప వివాదం నెలకొంది. ఇదిలా ఉండగా ఓ వ్యాపారి వద్ద పెట్టుబడి తీసుకొని పంట పండించిన రైతు మరో వ్యాపారి వద్ద సరుకు విక్రయిస్తుండగా వివాదం జరిగింది. ఈ గొడవ చినికి, చినికి వ్యాపారులు రైతులు రెండు వర్గాలుగా ఏర్పడి వివాదం పెద్దదయింది. దీంతో ఓ కమిషన్ వ్యాపారిపై రైతుల దాడి చేశారు . మార్కెట్ లో వ్యాపారులు కొనుగోలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మార్కెట్ కి చేరుకున్నారు. మార్కెట్ అధికారులు పాలకవర్గం వివాదాన్ని సర్దుమనిగించేందుకు చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు