మధిరలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ..

▪️ట్యాంక్ బండ్, వెజ్ & నాన్ వెజ్ మార్కేట్ ప్రారంభం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

▪️భారీ వాహనాలతో మంత్రి పువ్వాడ కు ర్యాలీతో స్వాగతం పలికిన BRS శ్రేణులు..

మధిర నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటించారు.

మధిర పట్టణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి BRS శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ద్వారా స్వాగతం పలికి పట్టణంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

మధిర కేంద్రంలో రూ.5.70 కోట్లతో నూతనంగా అంబారుపేట ట్యాంక్ బండ్, చిన్న పిల్లల ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఓపెన్ జిమ్, స్టీల్ కాంపౌండ్ తదితర పనులను ప్రారంభించారు. అనంతరం టూరిజం శాఖ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన స్పీడ్ బోట్ ను ప్రారంభించారు.

పట్టణంలోని వర్తక సంఘం రోడ్ నందు రూ.4.50 కోట్ల తో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కేట్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

తెలంగాణ తల్లి సెంటర్ నూతనంగా నిర్మించనున్న నూతన మున్సిపల్ భవనం, అంబేద్కర్ భవనం (ఆడిటోరియం), డంపింగ్ యార్డ్, వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

పట్టణంలో రాయపట్టణం సెంటర్ చేపట్టనున్న ప్రధన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు, CC రోడ్స్, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతం, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మున్సిపల్ చైర్మన్ మొండితొక లత, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, TPO రమేష్, నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed