VNB TV NEWS staff reporter vampatti Naidu




పోడు భూమి పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ.
▪️జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు గాను 1,51,195 ఎకరాలు పంపిణీ.
▪️పట్టాలు పొందిన ప్రతి రైతుకు ఉచిత విద్యుత్, రైతు బందు.
పోడు రైతుల సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పోడు పట్టల పంపిణీ ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా పంపిణీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సుగుణ ఫంక్షన్ హాల్ నందు అర్హులైన పోడు రైతులకు ఆయా పట్టాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా పంపిణీ చేశారు.
తొలుత సభలో నిన్న అకాల మరణం చెందిన వేద సాయిచంద్ గారి మృతికి నివాళిగా రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది.
కొత్తగూడెంలో 4541 మందికి గాను 15311.27ఎకరాలు, భద్రాచలంలో 6,515 మందికి గాను 16211.02 ఎకరాలు, ఇల్లందులో 12,347 మందికి గాను 36,588.37 ఎకరాలు, పినపాకలో 15962 మందికి గాను 52,438.39 ఎకరాలు, అశ్వారావుపేటలో 9,418మందికి గాను 25,817.15 ఎకరాలు, వైరాలో 1,812 మందికి గాను 4,826.40 ఎకరాలు జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు 1,51,1
