TSRTC కార్మికులు గవర్నమెంట్ లో విలీనం ఆంధ్రప్రదేశ్ అనుభవాలు SWF ప్రతిపాదములు

అనే పుస్తకమును డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి లింగమూర్తి

రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ వెంకటేశ్వర్లు గార్ల చేతుల మీదుగా ఖమ్మం డిపో వద్ద ఉదయము ఆవిష్కరణ చేయటం జరిగింది
ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యి మూడు సంవత్సరాలు అయినది అక్కడ ఉద్యోగస్తుల వేతనాలు, గ్రాడ్యుటీ ,ఉద్యోగ భద్రత, పెన్షన్ ,పనిగంటలు ,మెడికల్ సౌకర్యాలు ఇలా అనేక సమస్యలపై SWF రాష్ట్ర బృందం అధ్యయనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేష్ లో ఉద్యోగస్తులకు ఏమి సౌకర్యాలు వచ్చినాయి ఏమి కోల్పోయారో తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగస్తులు అవి కోల్పోకుండా , మంచి ప్రతిపాదనలు తయారు చేసి విలీన కమిటీకి , మేనేజింగ్ డైరెక్టర్ గారికి ,చైర్మన్ గారికి, వినతి పత్రాలు ఇచ్చి మొత్తం ఉద్యోగులకు తెలియపరిచేందుకు అట్టి ప్రతిపాదనలు పుస్తక రూపంలో తీసుకురావడం జరిగిందని అన్నారు ప్రతి ఉద్యోగి పుస్తకాన్ని అధ్యయనం చేసి ఇంకా ఏమైనా సూచనలు ఉంటే డిపో కమిటీకి తెలియజేయాలని కోరినారు

స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మంచి కృషిచేసి రాష్ట్రవ్యాప్తంగా బుక్ లెట్స్ వేసినారు దానిలో భాగంగా ఖమ్మం డిపో వద్ద పుస్తకావిష్కరణ జరిగిన వెంటనే గ్యారేజీ ,ఎర్నింగ్ సెక్షన్, సెక్యూరిటీ సిబ్బంది, అందరికీ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం రీజినల్ కార్యదర్శి పి సుధాకర్ రీజనల్ నాయకులు జె నాగేశ్వరరావు డిపో అధ్యక్షులు ఎస్ సీతారామయ్య కోశాధికారి జి రోశయ ప్రచార కార్యదర్శి పి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed