Sathupalli/30.09.2023

తేజ వార్త తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి నియోజకవర్గ

ఖమ్మం నగరంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర గారు, బండి పార్థసారథి రెడ్డి గారు, ఎమ్మెల్సీ తాతా మధు గార్లు హెలికాప్టర్ ద్వారా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు స్మారక కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సత్తుపల్లికి విచ్చేసిన వారికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి నాయకత్వంలో వేలాది మంది తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రచారరథంపై గులాబీ శ్రేణులకు అభివాదం చేస్తూ పురవీధుల గుండా సభాస్థలికి చేరుకున్నారు.

సత్తుపల్లిలో రూ.90కోట్లతో చాకలి ఐలమ్మ దోభీఘాట్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆడిటోరియం, షాధీఖానా, క్రిస్టియన్ భవన్, బస్టాండ్-ఎన్టీఆర్ నగర్ రోడ్డు విస్తరణ తదితర పనులకు వారు కలిసి శంకుస్థాపనలు చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని వారు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed