భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రూ.15.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు గాను భద్రాచలం అంబేడ్కర్ సెంటర్ నందు ఆయా పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.

▪️1). భద్రాచలం పట్టణంలో రూ.2.60 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్ మరియు సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

2). పట్టణంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సమగ్ర కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

3). పట్టణంలో రూ .1.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారులు & సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

4). భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ వద్ద రూ.38 కోట్లతో నిర్మించనున్న మిగులు కరకట్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

6). పట్టణంలో ఏరియా హాస్పిటల్ నందు రూ.21.50 లక్షలతో నిర్మించిన కిచెన్ కాంప్లెక్స్, సీసీ రోడ్స్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed