ఖమ్మంలో సిపిఐ ర్యాలీ

-పాల్గొన్న అజీజ్ పాషా

ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7 )) వెంపటి నాయుడు

పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి మద్దతుగా సిపిఐ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రం నుండి జెడ్పి వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ -సభ్యులు అజీజీపాషా, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఎస్కె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీర రామ్మూర్తి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా అజీజ్పషా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతోనే పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తుందని ఆరోపించారు. మానవత్వాన్ని మరిచి ఇజ్రాయిల్ గాజాలో మానవ నివాస ప్రాంతాల్లో బాంబు దాడులు చేస్తుందని ఆయన ఆరోపించారు. -తక్షణం యుద్ధాన్ని నిలిపి వేయాలని అజీజాపాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, రావి శివరామకృష్ణ. -పుచ్చకాయల కమలాకర్, తోట రామాంజనేయులు, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, జాగర్లమూడి రంజిత్ కుమార్, -మిడికంటి చిన్నవెంకటరెడ్డి, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed