సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన భారీ వాహనాల ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
వేంసూరు మండలం, కందుకూరు వేదిక సాగిన జాతీయ ఎండ్ల బండలాగుడు, పురుషుల కబడ్డీ పోటీల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వారితో పాటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్ధసారధిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీగా కార్లతో వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నిండినట్లయింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిసలు శ్రమిస్తున్న సండ్ర వెంకటవీరయ్య మళ్లీ ఎమ్మెల్యేగా రావాలని ప్రజలతో పాటు కందుకూరు వేదికగా సాగిన సభలో రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
Post navigation
సిఎం కెసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ.. ▪️మహిళల సాధికారత కోసమే అనేక పథకాలు. ▪️మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో ఆరోగ్య మహిళ పథకం.. వడ్డీ రహిత రుణాలు.. ▪️ మహిళా అభివృద్ధితోనే దేశ ప్రగతి. ▪️దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం.. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు. సిఎం కెసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చింది. మహిళల సాధికారత కోసం సిఎం కెసిఆర్ గారు అనేక పథకాలు అమలు చేస్తున్నారని, మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన మహిళలకు తినిపించారు. బిలీఫ్ హాస్పిటల్స్ అధినేత మేడంపూడి రమాజ్యోతి అధ్వర్యంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నందు జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గోన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి, పురోగతి జరుగుతుంది. దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం మన రాష్ట్రంలోనే జరిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యం కోసం అరోగ్య మహిళ, వడ్డీ రహిత రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా అన్ని రంగాల్లో విస్తృతంగా రాణిస్తున్నారని, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మహిళలకు అన్ని రంగాల్లో ఉన్నత స్థానం కల్పించారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని వారు అన్నారు. రూ.750 కోట్ల రూపాయల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి మహిళల తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులలో 250 కోట్ల రూపాయలు పట్టణ ప్రాంతాల మహిళల కోసం కాగా, 500 కోట్లు గ్రామీణ మహిళల కోసమని మంత్రి తెలిపారు. ఈ మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల 978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 ఏండ్లల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరింది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో సిఎం కెసిఆర్ గారికి, ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ వంటి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత అలుపెరగకుండా గత తొమ్మిదేళ్ళ కాలం నుంచి పోరాటం చేస్తున్నారని అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీర్మానాన్ని ఆమోదించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అందజేశారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్స్ కోసం తమ పార్టీ ఎంపీలతో సహా కవిత, తాను కూడా అనేక సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించామని తెలిపారు. ఈనెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్లు అమలు అయితే దాదాపు 180 ఎంపీ స్థానాలు మహిళలకు దక్కుతాయని, అలాగే ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ లలో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, అయితే లోక్ సభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు అని, ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుందని, కానీ బిజెపికి చిత్తశుద్ధి లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న పలువురుకి మహిళలకు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,ZP చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, సుడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DM &HO మాలతి, ZPTC ప్రియాంక, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.
💐అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో… లాస్య క్లినిక్ గాంధీనగర్,ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వద్ద డా,,యం యస్ చిన్ని ఆధ్వర్యంలో 9 మార్చి 2023న సాయంత్రం 5గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షురాలు శ్రీమతి నున్నా క్రిష్ణ ప్రియ ముఖ్యఅతిథిలుగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ,ఉపమేయర్ శ్రీమతి షేక్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత,33వ, డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తోట ఉమా రాణి వీరభద్రరావు, ఖమ్మం నగర సర్కిల్ ఇన్సుపెక్టర్ శ్రీమతి అంజలి,నగర కార్పొరేటర్ శ్రీమతి పల్లా రోజ్ లీనా సాల్మన్ రాజు, శ్రీమతి రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ కార్పొరేటర్,శ్రీమతి గట్టు కరుణ,శ్రీమతి బానోత్ ప్రమీల,శ్రీమతి యం స్వరూప రాణి,శ్రీమతి పద్మ స్వచ్ఛoద మహిళా సేవకురాలు,డా,,సుగుణ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు,డా,,శశాంక చర్మ వ్యాధుల నిపుణురాలు,డా,, పెదమళ్ల స్రవంతి, డా,,కావ్య యాలముడి తదితరులు పాల్గొంటున్నారు కావున మీకు హృదయ పూర్వక ఆహ్వానం,ముందుగా ఎన్నికచేయబడిన మహిళలకు సన్మానము మరియు నూతన వస్త్రములు బహుకరణ… పలు విభాగాల్లో పని చేస్తున్నటువంటి వారిని సన్మానించడం జరుగుతుంది డాక్టర్స్ ని ఐసిడిఎస్ వారిని ఆశా వర్కర్లని ఆయాలని మున్సిపల్ సిబ్బందిని ఫోర్త్ స్టేట్ జర్నలిస్టులని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సన్మానించడం జరిగింది కన్వీనర్…ఖమ్మం..