సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన భారీ వాహనాల ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

వేంసూరు మండలం, కందుకూరు వేదిక సాగిన జాతీయ ఎండ్ల బండలాగుడు, పురుషుల కబడ్డీ పోటీల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వారితో పాటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్ధసారధిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీగా కార్లతో వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నిండినట్లయింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిసలు శ్రమిస్తున్న సండ్ర వెంకటవీరయ్య మళ్లీ ఎమ్మెల్యేగా రావాలని ప్రజలతో పాటు కందుకూరు వేదికగా సాగిన సభలో రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు