వి ఎన్ బి న్యూస్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు

ఖమ్మం బడ్జెట్ హోటల్ నందు జరిగిన జిల్లా ఆర్య వైశ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

ఖమ్మం నగరంలోని వర్తక, వ్యాపారుల వ్యాపారానికి కపాలదరుడిగా ఉంది నిబద్దతో పని చేశామన్నారు.

మా నాన్న గారు నాకు ఇచ్చిన అస్తి ఆర్య వైశ్యులు అని స్పష్టం చేశారు.

ఒకప్పుడు దుర్భరమైన స్థితిలో ఉన్న ఖమ్మం త్రీ టౌన్ నేడు అద్భుతంగా అభివృద్ధి చెందిన విషయం గుర్తు చేశారు. దశాబ్దాల నాటి నుండి వివక్షకు గురైన త్రీ టౌన్ ను నేడు రోడ్లు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ, పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, కుడళ్ళ అభివృధ్ధి, మార్కేట్ లు, గాంధీ చౌక్ అభివృద్ధి, వీధి వ్యాపారుల ప్రాంగణాలు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి ఇలా అనేక పనులు చేశామని గుర్తు చేశారు.

ఎన్నికైన నాటి నుండి వర్తక వ్యాపారుల వద్ద నుండి ఒక్క కర్చీఫ్ కూడా తీసుకోలేదని, ఆ సంస్కృతి లేదని, కేవలం వర్తక వ్యాపారుల అభివృద్ధి మాత్రమే కోరుకునే అభిమతం మా నాన్న గారు నాకు ఇచ్చారని అన్నారు.

మీరు చేస్తున్న విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఆర్య వైశ్య కార్పోరేషన్ ఎర్పాటు చేయడానికి, అందుకు తగు కార్యాచరణ చేశారని త్వరలోనే దాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

సంఘం నాయకుడు కొత్త వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, వనమా సూరి, వేములపల్లి వెంకటేశ్వరరావు, దేవత అనిల్, కురువెల్ల ప్రవీణ్, వనమా విశ్వేశ్వరరావు, రాయపూడి వెంకట రామారావు, వదినేపల్లి శ్రీనివాసరావు, G y నరేష్, వర్తక, వ్యాపారులు, పుర ప్రముఖులు తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు