జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం..

▪️మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ..

▪️ఇరిగేషన్ స్థలం మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు..

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

▪️అతి త్వరలో పంపిణీ చేస్తామన్న మంత్రి పువ్వాడ..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మాట నిలుపుకున్నారు.

ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి హామీ మేరకు 5ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక Go జారీ చేసింది.

5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారిని కోరిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు నేడు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఆమోదం తెలిపారు.

ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

మంత్రి కి టియుడబ్ల్యూజే ఐజెయు కృతజ్ఞతలు

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అప్పగించాలని గత ఏడాది నుంచి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ కి
టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది

ఈ క్రెడిట్ అంతా రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ గారికి దక్కుతుందని జిల్లా జిల్లా కమిటీ అభిప్రాయపడుతూ మంత్రిగా మంత్రిగారికి జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు