వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

SUDA నిధులు రూ.65 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.

SUDA నిధులు మొత్తం రూ. 65 లక్షలతో VDF టెక్నాలజీతో నిర్మించిన CC రోడ్స్ ను వారు ప్రారంభించారు.

నగరంలోని 27వ డివిజన్ శ్రీనివాస నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను ప్రారంభించారు.

నగరంలోని 17 శ్రీనివాస్ నగర్ చింటల్ గ్రౌండ్ వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్స్ ను ప్రారంభించారు.

నగరంలోని 28వ డివిజన్ హిమాలయ స్కూల్ వద్ద రూ.25 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్స్ ను ప్రారంభించారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ లు ధనాల రాధ,
గజ్జెల లక్ష్మి వెంకన్న, కమర్తపు మురళి, మున్సిపల్ ఈ ఈ కృష్ణలాల్, డిఈ నవ్య జ్యోతి, ఏఈ సతీష్, నాయకులు RJC కృష్ణ, పగడాల నాగరాజు, ధనాల శ్రీకాంత్, పాలడుగు పాపారావు, మస్తాన్, మాటూరి లక్ష్మీనారాయణ, వడ్డెల్లి లెనిన్ చౌదరి, ప్రసన్న కృష్ణ, రవి, కొప్పెర నర్సింహ రావు, పత్తిపాక రమేష్, రాంబాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed