ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన డాక్టర్ కూరపాటి ప్రదీప్ .

వి ఎన్ బి న్యూస్ డిస్టిక్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు

ఖమ్మం నెహ్రూ నగర్ లో ఆదివారం ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ అభయ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంప్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు . ప్రతి మనిషికి ఆరోగ్యం అతి ముఖ్యమని తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవనశాలిని కొనసాగించాలని ఇంటిని పోషించేవారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు . తను సంపూర్ణఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబాన్ని పోషించుకునే స్టేమినా ఉంటుందన్నారు . వర్షాకాల నేపాథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని కావున సీజనల్ వ్యాధుల పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఈ రోజు జరిగిన ఉచిత క్యాంప్ లో బీపీ , షుగర్ , జ్వరం , జలుబు , కీళ్ల నొప్పులు , థైరాయిడ్ వంటి వ్యాధులకు టెస్టులు చేసి అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేశారు . చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు . ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథుధిగా వచ్చిన నగర గ్రంధాలయ చైర్మన్ ఎండి ఆశ్రిఫ్ ను శాలవాతో సత్కరించారు . ఈ శిబిరంలో శ్రీ అభయ హాస్పిటల్ డాక్టర్లు డా.అహ్మద్ ఖాన్ (MD General medicine ) , డా.ఫణి తేజ (MS ORTHO ), డా.మహబూబ్ బాషా ( MS SURGEON ), డా.బ్రహ్మ కుమార్ ( MD Paediatric ) వీరితో పాటు ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్నా సి బాలరాజు , నగర అధ్యక్షులు ఎస్.కె హషిమ్ షరీఫ్ , గిరిబాబు , లింగమూర్తి , ఆర్కే చారి , రాజేష్ , ఫరీద్ , కావేరి నాగేశ్వరరావు , షకీల్ , రాము ఇంకా నగర ఎలక్ట్రిషన్ తదితరులు ఉన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు