నూతన కమిటీకి పలువురి శుభాకాంక్షలు..

ఖమ్మం మే 27 VNB న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

ముస్లిం మైనార్టీల వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం, ముస్లిం హక్కుల సాధన కోసం నిర్మితమైన రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ సమక్షంలో ఖమ్మం నగరంలోని 2 వ డివిజన్ లో నూతన కమిటీ నియామకం జరిగింది. మంగళవారం ఖమ్మం నగరంలోని 2 వ డివిజన్ పాండురంగాపురంలో గల మస్జిద్ ఎ ఖూబా ఆవరణలో ఆర్ పీ వీ సంస్థ నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ ఖాసిం, అబ్దుల్ వాహేద్, గౌరవ అధ్యక్షులుగా సదర్ మహమ్మద్ ఫయాజ్ ,
గౌరవ సలహాదారులు మౌలానా మహమ్మద్ గులాం రబ్బానీ..(ఆలిమ్), ఉపాధ్యక్షులు గౌస్ పాషా, యాకుబ్ మియా, సహాయ కార్యదర్శులుగా ఏండి. అబ్దుల్ వహీద్, షేక్ హుస్సేన్ మియా,
ఈసీ సభ్యులుగా షేక్ సుభాని, ఎండి సలీం, షేక్ ఇర్ఫాన్, షేక్ జానీపాషా, నాగుల్ మీరా, తడుతరులనునియమించారు.. అనంతరం నూతన కమిటీ బాధ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు