భీమా సొమ్ము 10 లక్షల రూపాయల చెక్కు నామినికు అందజేత… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

*2087 మల్టీ పర్పస్ వర్కర్లకు పోస్టల్ గ్రూపు ప్రమాద బీమా కల్పన

ఖమ్మం ఆగస్టు 4 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు))

ప్రమాదవశాత్తు మరణించిన మల్టీ పర్పస్ వర్కర్ కు సంబంధించిన భీమా సొమ్ము 10 లక్షల రూపాయల చెక్కును నామినికు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో మల్టీపర్పస్ వర్కర్ వీరస్వామి నామినికు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పది లక్షల రూపాయల భీమా చెక్కు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మల్టీ పర్పస్ వర్కర్లు గా పని చేస్తున్న 2087 మంది కార్మికులకు పోస్టల్ శాఖ ద్వారా ప్రమాద భీమా చేయించడం జరిగిందని, ఏప్రిల్ నెలలో ప్రమాదవశాత్తు మరణించిన మల్టీపర్పస్ వర్కర్ వీరస్వామి నామినీ జి. జమలమ్మకు నేడు ప్రమాద భీమా సొమ్ము 10 లక్షల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రమాద భీమా రెన్యువల్ సకాలంలో జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈఓ దీక్ష రైనా, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు