1లక్ష 30 వేల రూపాయల స్కాలర్షిప్పులను పేద పద్మశాలి విద్యార్థులకు మరియు వికలాంగులకు పంపిణీ

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు  నవంబర్ 2

పద్మశాలి ఉద్యోగుల ఆత్మీయ సమావేశం 14వ వార్షికోత్సవం సందర్భంగా డిఆర్పిసి భవనం నందు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం లక్ష రూపాయల స్కాలర్షిప్లను పేద పద్మశాలి పిల్లలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు . అలాగే ప్రతి సంవత్సరం పదవీ విరమణ మరియు పదోన్నతి పొందిన ఉద్యోగస్తులను సతి సమేతంగా సన్మానించుకోవడం జరుగుతుందన్నారు . ఈ సంవత్సరం వికలాంగులకు 30 వేల స్కాలర్షిప్ ను పంపిణీ చేశామని తెలియజేశారు . రాబోవు కాలంలో ఈ స్కాలర్షిప్ లను రెండు లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు . సంఘం ప్రధాన కార్యదర్శి మొరం మధు కుమార్ కార్యక్రమాన్ని అన్ని రంగాల్లో విజయం సాధించేలా కృషి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్థపు మురళి , రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జిల్లా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నారు కానీ రాజకీయంగా లేరని కావున పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని పేర్కొన్నారు . అనంతరం సుమారు 1లక్ష 30 వేల స్కాలర్షిప్పులను పేద పద్మశాలి విద్యార్థులకు మరియు వికలాంగులకు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అంచ నాగరాజు , మోతుకూరు జానకి రాములు , ఉదారి గోపాల్ రావు , బండారు వెంకన్న , అప్పని భాస్కరరావు , నాగుల కృష్ణమూర్తి , రచ్చ రామారావు , పిల్లలమర్రి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు