Category: GLOBAL

ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు పంపిణీ
ముఖ్య అతిథి ఏసిపి పి.వి.గణేష్
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మదర్స -ఎ- ఇస్లామియా దారుల్ ఉలూమ్ లో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేద ముస్లింలకు ఉపవాసాలు ఉండే సమయంలో ఉపవాస దీక్షలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నెలకు సరిపడ సరుకులు , బియ్యం పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి నగర ఏసిపి పి.వి. గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యవసర సరుకులు పేద ముస్లింలకు అందజేసారు . సంస్థ నిర్వహకులు ఫ్రీ అంబులెన్స్ , ఫ్రీ నిత్యావసరాలు , చదువుకు , పెళ్లికి ఇలా సమాజంలో ఉన్న వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు . పండుగ అంటే అందరు జరుపుకొనేదని అందరి కోసం కొందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమాజానికి మంచి సందేశం ఇస్తుందన్నారు . సుమారుగా నిరుపేద ముస్లింలకు వంద మందికి అందజేశారు . ఈ కార్యక్రమంలో అభయ హస్పిటల్ సిఈఓ కరీం , మౌలానా సాదతుల్లాహ్ , ఎండి. మునవ్వర్ (సేఫ్ బాగ్స్ ) , హాఫిజ్ ఫజల్ , హాఫిజ్ నజీర్ , ముఫ్టీ మహబూబ్ అలీ , ముఫ్టీ సల్మాన్ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు .

వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళన
ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఖమ్మం కార్పోరేషన్ లోని 16 డివిజన్లతో సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా BRS జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, ఎంపి నామా నాగేశ్వరరావు గారు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు పాల్గొని మాట్లాడారు.
అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహింస్తున్నమని పేర్కొన్నారు.
నాకు BRS పార్టీ ద్వారా మీలాంటి వేల మంది కుటుంబాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని, అన్నిటి కంటే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఇలానే ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలిచే జ్ఞాపకశక్తిని నాకు జీవితాంతం దేవుడు ఇలాగే ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ఖమ్మం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబ సభ్యులు అని వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా చేర్చగలిగామని వివరించారు.
దళిత బందు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు.
నన్ను ఖమ్మం ప్రజలు అందరి వాడుగా చూసుకుంటారని, మైనారిటీలు ప్రేమతో అజయ్ ఖాన్ గా పిలుచుకుంటారు క్రైస్తవులు ప్రభువు బిడ్డగా ఆత్మీయంగా చూసుకుంటారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గత ఖమ్మంను నేటి ఖమ్మంతో పోల్చి చూడండి, ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్ లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
నేడు ఎక్కడైనా వాటర్ ట్యాంకర్ లు కనబడుతున్నాయా అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని అన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బుజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.
నాకు ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే చదివినా.. ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, నా బతుకు ఇక్కడే.. నా చావు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు.
ఇక్కడ ఓటు లేనోల్లు కూడా దాబులకు మాట్లాడుతారని, ఎం అర్హత ఉందో తెలియక కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని తాటాకు చప్పుళ్ళు చేస్తు, అవాక్కులు చవాక్కులు పెలుతున్నారని అన్నారు.
నీ ఊడత ఉపుడుకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ గారు అని అది గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిదని హితువు పలికారు.

💐అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో… లాస్య క్లినిక్ గాంధీనగర్,ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వద్ద డా,,యం యస్ చిన్ని ఆధ్వర్యంలో 9 మార్చి 2023న సాయంత్రం 5గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షురాలు శ్రీమతి నున్నా క్రిష్ణ ప్రియ ముఖ్యఅతిథిలుగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ,ఉపమేయర్ శ్రీమతి షేక్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత,33వ, డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తోట ఉమా రాణి వీరభద్రరావు, ఖమ్మం నగర సర్కిల్ ఇన్సుపెక్టర్ శ్రీమతి అంజలి,నగర కార్పొరేటర్ శ్రీమతి పల్లా రోజ్ లీనా సాల్మన్ రాజు, శ్రీమతి రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ కార్పొరేటర్,శ్రీమతి గట్టు కరుణ,శ్రీమతి బానోత్ ప్రమీల,శ్రీమతి యం స్వరూప రాణి,శ్రీమతి పద్మ స్వచ్ఛoద మహిళా సేవకురాలు,డా,,సుగుణ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు,డా,,శశాంక చర్మ వ్యాధుల నిపుణురాలు,డా,, పెదమళ్ల స్రవంతి, డా,,కావ్య యాలముడి తదితరులు పాల్గొంటున్నారు కావున మీకు హృదయ పూర్వక ఆహ్వానం,ముందుగా ఎన్నికచేయబడిన మహిళలకు సన్మానము మరియు నూతన వస్త్రములు బహుకరణ… పలు విభాగాల్లో పని చేస్తున్నటువంటి వారిని సన్మానించడం జరుగుతుంది డాక్టర్స్ ని ఐసిడిఎస్ వారిని ఆశా వర్కర్లని ఆయాలని మున్సిపల్ సిబ్బందిని ఫోర్త్ స్టేట్ జర్నలిస్టులని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సన్మానించడం జరిగింది కన్వీనర్…ఖమ్మం..


ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం..
▪️మహిళా శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన సరికొత్త పథకం.
▪️ఆరోగ్య మహిళలో ప్రతి మంగళవారం 57 రకాల ఉచిత పరీక్షలు.
▪️జిల్లా ఆసుపత్రిలో 65 పడకల ప్రత్యేక మహిళా వార్డు, రేడియాలజీ హబ్‌.
▪️ప్రారంబించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
అరోగ్య మహిళ పథకం మహిళలకు వరంలాంటిదని, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మరో గొప్ప వరాన్ని అందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే మంచి కార్యక్రమాన్ని రూపొందించిందని మంత్రి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మహిళలa ఆరోగ్యంకై మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ యూనిట్‌, Mammogram ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇస్తారన్నారు. అవసరమైతే ఇతర దవాఖానలకు రెఫర్‌ చేస్తారన్నారు.
పరీక్షల అనంతరం ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలు నమోదు చేసి ప్రతి పేషంట్‌కు తన ఆరోగ్య పరిస్థితి, వైద్యం వివరాలతో కూడిన కేస్‌ షీట్‌ అందజేసి పరీక్షలు పూర్తయ్యాక మెరుగైన వైద్యసేవలు అవసరమని భావిస్తే ఇతర దవాఖానలకు రిఫర్‌ చేస్ అవకాశం ఉందన్నారు. అక్కడ వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తారన్నారు.
మెరుగైన సేవలతో విశేష ఆదరణ
ప్రభుత్వ దవాఖానలు సరికొత్తగా మారాయని, స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడం, నాణ్యమైన మందులు అందిస్తుండడంతోనే ప్రజాదరణ పెరుగుతున్నదన్నారు.
అనతికాలంలోనే రోగుల సంఖ్య రెట్టింపయిందని, ఈ క్రమంలోనే అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.
DM &HO మాలతి మాట్లాడుతూ.. అరోగ్య మహిళలో వీటిలో 57 రకాల పరీక్షలు ఉచితం
మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆయా రుగ్మతలను గుర్తించేందుకు ప్రతి మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుందని, దీని కోసమే ‘ఆరోగ్య మహిళ’అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
ఇందులో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి, మందులు, అవసరమైన వారికి చికిత్స కూడా చేయనున్నామని, ప్రధానంగా డయాగ్నోస్టిక్స్‌, సూక్ష్మపోషక లోపాలు, పీసీవోఎస్‌, కుటుంబనియంత్రణ, రుతు సమస్యలు, లైంగిక వ్యాధులు, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మెనోపాజ్‌ నిర్వహణ, శరీర బరువుకు సంబంధించిన పరీక్షలు చేసి 24 గంటల్లోనే రిపోర్ట్‌లు అందిస్తారన్నారు.
మహిళలకు షుగర్‌, బీపీ, రక్తహీనత వంటి వాటికి సాధారణ పరీక్షలతో పాటు లక్షణాల మేరకు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఇంకా వెయిట్‌ మేనేజ్‌మెంట్‌, సెక్స్‌వల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ మే నేజ్‌మెంట్‌, ఇన్‌ఫర్టిలిటీ మేనేజ్‌మెంట్‌, మోనోపాజ్‌, థైరా యిడ్‌, విటమిన్‌డీ-3, ఈ-12 డెఫిసియన్సి వంటి వాటికి దవాఖానల్లో స్క్రీనింగ్‌ చేస్తారన్నారు.
దాంతో పాటు యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌, పెల్విక్‌ ఇన్‌ప్లమేటరీ వ్యాధులకు కూడా పరీక్షలు చేయనున్నారని, అసవరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారని, హర్మోన్‌ రీప్లేస్‌మెంట్‌, థెరపీ మెడికేషన్‌, కౌన్సెలింగ్‌ ఇస్తారు. బరువుకు సంబంధించి యోగ, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగించుకోవాలన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆమె’… తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది… భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం…

Pratipada Vidyarthi vannatha chadu qawwali
ప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలి..
▪️సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు.. ఉన్నత విలువలతో విద్యా ప్రమాణాలు..
▪️ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
▪️మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో రూ.57.38 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంబించిన మంత్రి పువ్వాడ.
పాఠశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి అని అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 53వ డివిజన్ NSP క్యాంప్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడి ఉన్నత విద్యను ఉచితంగా అభ్యసించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో ఇంకా 16 ప్రభుత్వ పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని అతి త్వరలో వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని హామి ఇచ్చారు.
ఇప్పటికే నిర్దేశించిన పాఠశాలలు పూర్తి అయ్యాయని, అందులో విద్యార్థులు అద్భుతంగా విద్యను అందుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని, ఇంగ్లీష్ విద్యను అందించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఇటీవలే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు తనకు విజ్ఞప్తులు పెరుగుతున్నాయని, ఆయా తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్ కోసం అడిగినపుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అన్నారు.
దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోందన్నారు.
దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ, స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థ పై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు. తొలుత ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఆయా పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూ‌లు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్యా నాగరాజ్, సుడా చైర్మన్ విజయ్, DEO సోమశేఖర్ శర్మ, RJC కృష్ణా తదితరులు ఉన్నారు.

★రఘునాథపాలెం మండలంలో పొలాలకు రాజభాటలు వేసిన మంత్రి పువ్వాడ
◆2కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్న డొంక రోడ్ల నిర్మాణ పనులు
◆హర్షిస్తున్న రైతన్నలు
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్ల రూపురేఖలు మారాయి. మండల వ్యాప్తంగా ప్రధాన రోడ్లు అన్ని ఇప్పటికే సుందరంగా తయారయ్యాయి. 10 సంవత్సరాల క్రితం ఖమ్మం నియోజకవర్గంను చూసి ఇప్పుడు చూసినవాళ్లు అబ్బురపడుతున్నారు. గతంలో కొంత అభివృద్ధి జరిగినా ఇప్పుడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రెండు కోట్ల ప్రత్యేక నిధులతో డొంక రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా మండల ప్రజానీకం, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

You missed