Month: February 2023


టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్..!
▪️మంత్రి పువ్వాడ సూచనలతో మార్చిలో అందుబాటులోకి 16 ఏసీ స్లీపర్ బస్సులు.
▪️కొత్త బస్సును పరిశీలించి, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా సంస్ధ ఎండి ఆరా..
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది.
ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది.
నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.
ఆయా బస్సులను మార్చి నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికే సంస్థకు ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టిఎస్ ఆర్టీసి ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనాతో ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, పరిశీలించారు.
బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
▪️బస్సు ప్రత్యేకతలివే..!
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది.
బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది.
ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.
వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు.
ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి.
అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది.

అభివృధ్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
▪️మల్లేపల్లి, రాములు తండా, బావోజి తండా, జింకల్ తండా, పరికలబొడు తండా గ్రామాల్లో మొత్తం 30 పనులకు గాను రూ.1.13 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో చేపట్టిన 36 పనులకు గాను రూ.1.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
మల్లేపల్లి గ్రామంలో 9పనులకు గాను రూ.26.20 లక్షలు, రాములు తండా గ్రామంలో 5 పనులకు గాను రూ.20 లక్షలు, బావోజి తండా గ్రామంలో 11 పనులకు గాను రూ.33 లక్షలు, జింకల్ తండా గ్రామంలో 9 పనులకు గాను రూ.26.10 లక్షలు, పరికలబొడు తండా గ్రామంలో 2 పనులకు గాను రూ.7.75 లక్షలు మొత్తం పూర్తి అయిన అభివృద్ధి పనులు రూ.1.13 కోట్ల రూపాయల విలువైన సీసీ రోడ్లు, సీసీ కాల్వలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోనే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని, కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో BT, CC రోడ్లతో పాటు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు.

దశలవారీగా కార్యాచరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ జర్నలిస్టులకి హామీ

ఆందోళన అవసరం లేదు *దశల వారి ప్రక్రియకు కార్యాచరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఖమ్మం ఫిబ్రవరి 20: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖమ్మం జిల్లా…

నిర్లక్ష్యాల నీడలో ఖమ్మం పత్తి మార్కెట్

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకటైన పత్తి మార్కెట్ యార్డు నిర్లక్ష్యం నీడలో కొనసాగుతుందివ్యవసాయ మార్కెట్ కు గత మూడు రోజులుగా సెలవులు రావడం తో కోట్లు విలువ చేసే పత్తిని మార్కెట్లో ట్రేడర్స్ నిల్వ ఉంచారు. లారీలు లేకపోవడం వలన తాము…

జర్నలిస్టులకు మద్దతుగా నిలుస్తామని సిపిఎం పార్టీ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు వెల్లడి

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు .. ఐదు ఎకరాలు ఎలా సరిపోతాయి?

తీర్థాల జాతరకు ప్రతిష్టమైన బందోబస్తు సిపి విష్ణు వారియర్స్

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం … తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్ మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శనివారం ఖమ్మం రూరల్…


జర్నలిస్టులకు వెలుగులు నింపిన సీఎం కేసీఆర్
మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ
సీఎం కెసిఆర్.. మంత్రి పువ్వాడ చిత్రపటాలకు జర్నలిస్టుల పాలాభిషేకం
ఖమ్మంలో జర్నలిస్టుల హర్షాతిరేకాలు
ఖమ్మం ఫిబ్రవరి 7: అనేక దశాబ్దాల ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలలను సహకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లు ఖమ్మం జర్నలిస్టులకు వెలుగులు నింపే విధంగా ఇండ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఖమ్మం నగరంలోని జర్నలిస్టులకు మొదటి దశ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈనెల10 న లేదా 14న మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న నేపథ్యంలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ TUWJ TJF ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మంత్రి తన్నీరు హరీష్ రావు చిత్రపటాలకు ఘనంగా పాలభిషేకం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని తూచా తప్పకుండా మాట నిలబెట్టుకున్న నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. జర్నలిస్టులు అనేక ఏళ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, వాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేత స్పష్టమైన హామీని ఇప్పించడంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సాగద్యంలో ఎవ్వరికి అనేక దఫాలుగా మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి వినత పత్రాల రూపంలో అభ్యర్థించడం జరిగిందని, వివిధ రూపాలలో తలపెట్టిన ఉద్యమాల ఫలితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కడం అభినందనీయమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. జర్నలిస్టుల కళ్ళల్లో వెలుగులు నింపిన సర్కార్ కు రుణపడి ఉంటామఅన్నారు.
పాలాభిషేకం కార్యక్రమం ఉత్సాహపరితంగా ఆనందోత్సవాల నడుమ కొనసాగింది.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి వెంపటి నాగేశ్వరరావు నాయుడు జీవన్ రెడ్డి, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యల్లమందల జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ పాషా, జిల్లా, నగర నాయకులు పానకాలరావు, వల్లూరి సంతోష్, జక్కుల వెంకటరమణ, ఆర్ కె, తిరుపతి రావు, రోసి రెడ్డి, వెంకటరెడ్డి, రంజాన్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరలో ప్రారంభించారు మంత్రి తెలిపారు

KHAMMAM;ఐదేళ్లు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం కాదు ఐదు తరాల అభివృద్ధి యే అజయ్ అన్న ధ్యేయం. 👇నగర ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి రానున్న వెజ్ & నాన్ వెజ్ మార్కెట్.. ▪️ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్న అధికారులు.. ▪️మంత్రి పువ్వాడ…

నగర ఏసిపిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ pvగణేష్ మర్యాదపూర్వకంగా సిపి ని కలిసిన ఏసిపి

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు … ది.03.02.2023పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …. ఖమ్మం టౌన్ ఏసీపీ గా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్ ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ. గణేష్ ఖమ్మం ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం…

మన బస్తి మనబడి కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మొదటి విడత మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా మామిళ్ళగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. పాల్గొన్న మేయర్ నీరజ గారు,కలెక్టర్ గౌతమ్ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్…

You missed