Month: March 2023

అకాల వర్షాలకి పంట నష్టం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం తమ్మినేని వీరభద్రం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తున్న తమ్మినేని వీరభద్రం నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కౌలు రైతుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నష్టపోయిన పంటలను…

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం.. ▪️మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో మీడియా సమావేశం. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.…

అకాల వర్షాలకి పంట నష్టాన్ని స్వయానా పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా రాక

రేపు జిల్లాల్లో సీఎం పర్యటన.. పంటలను పరిశీలించనున్న కేసీఆర్‌ ఖమ్మం జిల్లాకు సీఎం రాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల…

చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 19 శాఖల వారు ఏఎంసి చైర్మన్ శ్వేత ఏసిపి గణేష్ త్రీటౌన్ సిఐ సత్యనారాయణ ని ఘనంగా సన్మానించడం జరిగింది

20 మార్చి సాయంత్రం పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఏ యం సి ఛైర్ పర్సేన్ శ్వేత కు ,ఏ సి పి గణేష్,లకు ఘన సన్మానమునూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినమార్కెట్ కమిటీ చైర్ పర్సన్…

ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు పంపిణీ
ముఖ్య అతిథి ఏసిపి పి.వి.గణేష్
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మదర్స -ఎ- ఇస్లామియా దారుల్ ఉలూమ్ లో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేద ముస్లింలకు ఉపవాసాలు ఉండే సమయంలో ఉపవాస దీక్షలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నెలకు సరిపడ సరుకులు , బియ్యం పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి నగర ఏసిపి పి.వి. గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యవసర సరుకులు పేద ముస్లింలకు అందజేసారు . సంస్థ నిర్వహకులు ఫ్రీ అంబులెన్స్ , ఫ్రీ నిత్యావసరాలు , చదువుకు , పెళ్లికి ఇలా సమాజంలో ఉన్న వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు . పండుగ అంటే అందరు జరుపుకొనేదని అందరి కోసం కొందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమాజానికి మంచి సందేశం ఇస్తుందన్నారు . సుమారుగా నిరుపేద ముస్లింలకు వంద మందికి అందజేశారు . ఈ కార్యక్రమంలో అభయ హస్పిటల్ సిఈఓ కరీం , మౌలానా సాదతుల్లాహ్ , ఎండి. మునవ్వర్ (సేఫ్ బాగ్స్ ) , హాఫిజ్ ఫజల్ , హాఫిజ్ నజీర్ , ముఫ్టీ మహబూబ్ అలీ , ముఫ్టీ సల్మాన్ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు .

వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళన
ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఖమ్మం కార్పోరేషన్ లోని 16 డివిజన్లతో సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా BRS జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, ఎంపి నామా నాగేశ్వరరావు గారు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు పాల్గొని మాట్లాడారు.
అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహింస్తున్నమని పేర్కొన్నారు.
నాకు BRS పార్టీ ద్వారా మీలాంటి వేల మంది కుటుంబాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని, అన్నిటి కంటే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఇలానే ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలిచే జ్ఞాపకశక్తిని నాకు జీవితాంతం దేవుడు ఇలాగే ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ఖమ్మం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబ సభ్యులు అని వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా చేర్చగలిగామని వివరించారు.
దళిత బందు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు.
నన్ను ఖమ్మం ప్రజలు అందరి వాడుగా చూసుకుంటారని, మైనారిటీలు ప్రేమతో అజయ్ ఖాన్ గా పిలుచుకుంటారు క్రైస్తవులు ప్రభువు బిడ్డగా ఆత్మీయంగా చూసుకుంటారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గత ఖమ్మంను నేటి ఖమ్మంతో పోల్చి చూడండి, ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్ లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
నేడు ఎక్కడైనా వాటర్ ట్యాంకర్ లు కనబడుతున్నాయా అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని అన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బుజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.
నాకు ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే చదివినా.. ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, నా బతుకు ఇక్కడే.. నా చావు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు.
ఇక్కడ ఓటు లేనోల్లు కూడా దాబులకు మాట్లాడుతారని, ఎం అర్హత ఉందో తెలియక కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని తాటాకు చప్పుళ్ళు చేస్తు, అవాక్కులు చవాక్కులు పెలుతున్నారని అన్నారు.
నీ ఊడత ఉపుడుకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ గారు అని అది గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిదని హితువు పలికారు.

ది. 18.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి…వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా
ఖమ్మంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గల భరోసా సెంటర్ ను ఈరోజు సందర్శించి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
హింసకు గురైన మహిళ ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్, వైద్యం సదుపాయం, న్యాయ సహాయం, పోలీస్ సహాయంతో
భరోసాను కల్పిస్తున్నారని అన్నారు.
2022 మార్చి 18న ప్రారంభమైన ఈ భరోసా సెంటర్లో ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ల ద్వారా లైంగిక వేధింపులు మరియు లైంగిక దాడులు గురైన బాధిత మహిళల 95 కేసులని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 95 కేసులలో కౌన్సిలింగ్ ని,161 స్టేట్మెంట్ రికార్డింగ్-92, మెడికల్ సర్వీస్-39, కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డింగ్-90, బాధ్యత మహిళల హోం విజిట్-60, అవగాహన కార్యక్రమాలు-47, ప్రభుత్వం ద్వారా బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం కాంపెన్సేషన్ అప్లై -59, విద్య మరియు వసతి సౌకర్యం కోసం బాధితులను బాలల సంక్షేమ సమితి-11, భరోసా నుండి బాధితులకు సహాయం అందించడం కోసం బాధిత మహిళల సహాయ నిధి ని 11 మందికి 55 వేల రూపాయలు సహాయం అందించటం జరిగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి( L&O) సుభాష్ చంద్రబోస్, టౌన్ ఏసిపి గణేష్, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ట్రాఫిక్ సిఐ అంజలి, భరోసా ఇంచార్జ్ ఎస్సై ఉమా, సంధ్యారాణి,భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి మరియు స్టాప్ పాల్గొన్నారు
వీఆర్వో

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
బిఎస్ పి పార్టీ ఆదేశానుసారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు..
మన తెలంగాణ రాష్ట్ర బహుజన ఉద్యమ రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు Dr.R.S. ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడి, వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వాన్ని నిలదీస్తూ, Group 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితులలో తెలంగాణ నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తును కాపాడడం కోసం ఆమరణ దీక్షకు పూనుకొన్న మన నాయకుడు ప్రవీణ్ కుమార్ గారని మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ లు బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, Dr. M. వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిల్ల దయానందరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు Dr. సాంబశివ గౌడ్, అరుణ క్వీన్ లతోపాటు అనేకమంది రాష్ట్ర నాయకులను మరియు మహిళా నాయకురాళ్లను కూడా భారీ ఎత్తున పోలీసులు అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ స్థాయిలలోని నాయకులందరూ వెంటనే వీలైన చోటల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండకట్టి మన నాయకుల అరెస్టులకు నిరసన తెలుపాల్సిందిగా మన సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రాంజీ గౌతమ్ (M.P) గారు ఆదేశించడం జరిగింది.
వెంటనే రంగంలోకి దూకుదాం పదండి.
ఇట్లు
ప్రభాకర్ మంద
రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్
తెలంగాణ

జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి వారి పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి ఆలయ కమిటీ వారు చైర్మన్ గారిని శాలువాతో సత్కరించారు.

You missed