తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కీ
ముఖ్యాతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
ఎస్.ఆర్.అండ్.బీ.జే.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ లో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. మున్సిపాలిటీ వాహనాలతో పెద్ద ఎత్తున సఫాయి కార్మికులు బతుకమ్మలతో కోలాట నృత్యలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మునిసిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన సఫాయి కార్మికులకు సలాం అంటూ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కితాజు ఇచ్చారు.. బుల్డోజర్ లెక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ గారు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం ఈ విధంగా అభివృద్ధి జరిగిందంటే మంత్రి కేటీఆర్ గారి అండ, సీఎం కేసీఆర్ గారి చొరవతో సాధ్యమైంది అని మంత్రి పువ్వాడ తెలిపారు. మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తిస్తూ సీఎం కేసీఆర్ గారు సఫాయి అన్నా సలాం అన్న, సఫాయి అమ్మ సలాం అమ్మ అనే నినాదాలు తీసుకొచ్చారని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న మున్సిపల్ కార్మికులకు, అధికారులకు, పాలకమండలికి, కమీషనర్, కలెక్టర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందనలు తెలిపారు. ఉత్తమ సేవలందించిన సఫాయి కార్మికులకు అధికారులకు శాలువాలు, మెమొంటోతో మంత్రి సత్కరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు