Vnb న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
ఖమ్మం సెప్టెంబరు,30 :.
కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెని రూ.70 కోట్లతో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫ్యాక్లరీకి రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కమార్‌తో కలిసి శంఖుస్థాపన చేశారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి మొదటిగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫాక్టరీకి శంఖుస్థాప చేశారు. ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెనీ నెలకొల్పనున్న ఫామాయిల్‌ ఫ్యాక్టరీలో యువతకు మంత్రి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. హైద్రాబాదు నగరంతో పాటు నగరాల్లో వివిధ ఫార్మా, ఐటి ఇతర రంగ సంస్థలు పరిశ్రమల స్థాపనకు మొగ్గుచూపడం అభినందనీయమన్నారు. గోద్రెజ్‌ కంపెనీ నిర్మిస్తున్న ఫ్యాక్టరీని ఈ ప్రాంత రైతులు సద్వినియొగం చేసుకొని, ఆర్థికంగా పైకి ఎదగాలని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌, డిసిసిబి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రైతు బంధు జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, బాలసాని లక్షీనారాయణ, జిల్లా కలెక్టర్‌ విపి గౌతమ్‌, గోద్రెజ్‌ కంపెనీ ప్రతినిధులు , స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు