నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి

  • ఆర్జేసీ కృష్ణ తనయ దంపతులను ఆశీర్వదించిన గులాబీ బాస్
  • కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కృష్ణ దంపతులు
    కొత్తగా పెళ్ళైన నూతన దంపతులను గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసారా ఆశీర్వదించారు. ఇటీవల వివాహం జరిగిన ఆర్జేసీ కృష్ణ కుమార్తె ధాత్రి దంపతులకు కేసీఆర్ వివాహ శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు కృష్ణ దంపతులతో పాటు నూతన వధూవరులు సైతం బుధవారం హైదరాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నూతన వధూవరులకు కేసీఆర్ తో పాటు కవిత కూడా వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పూర్వకంగా ఇంటికి వచ్చిన కృష్ణతో పాటు ఆయన కుమార్తె దంపతులకు కూడా కేసీఆర్ పట్టు వస్త్రాలు పెట్టి ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు