దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

దూదేకులం ను ప్రభుత్వం ఆదుకోవాలి

విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా

ఖమ్మం, ప్రతినిధి మార్చి 13 మన జ్యోతి

దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్బాష్ దూదేకుల (బి.సి) ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 18 లక్షల జనాభా కలిగిన దూదేకుల కులాలకు ఇందిరమ్మ రాజ్యంలో తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 16కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాదేకులను కూడా బిసిలుగా పరిగణించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని కాని తెలంగాణలో మాత్రం ఏర్పాటు చేయకపోవడం బాధకరమని అన్నారు. గత ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించిన పట్టించుకోలేదని తమ సమస్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసినా ఏనాడు కూడా గత ప్రభుత్వం చెవిన పెట్టలేదని ఆవేదన వెల్లిబుచ్చారు. దూదేకుల ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం మారాలని ఆదిశగానే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ఓటు అనుకూలంగా పడ్డాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుందని భరోసాతో వేడుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి దూబేకుల కులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రహీమ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దానివేగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు షకీనాబీ, జిల్లా అధ్యక్షులు రహీమ్పాషా, నగర అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా సభ్యులు లాల్ సా బ్ సాహెబ్ హుస్సేన్, సిద్దిక్పషా, మదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు