సాగు, త్రాగు నీరు తక్షణమే విడుదల చేయాలి..

– సాగర్ జలాలతో పాలేరు జలాశయాన్ని వెంటనే నింపాలని డిమాండ్.

– ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రజలు, రైతులు త్రాగు, సాగు నీరు తక్షణమే విడుదల చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు.

సాగు,నీరు లేక పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేకుండా మిన్నకుండి పోయింది అని ద్వజమేత్తారు.

పాలేరు జలాశయంను తక్షణమే నింపాలని జిల్లా BRS నేతలు పాలేరు జలాశయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్లకార్డ్స్ పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

తొలుత ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్వర్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మాజి ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య గారు, బానోత్ మధన్ లాల్, చంద్రావతి గారు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎండిపోయిన వారి పంట ను పరిశీలించి రైతులు, కూలీలతో మాట్లాడారు.

రైతులు, ప్రజల పక్షాన ఉండి వారికి అండగా ఉంటామని, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదదీసి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో పాలన చేతకాక ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందేకాక, సాగుత్రాగు నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడం విచారకరం అన్నారు.

ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని తాగు, సాగునీరు కొరకు వెంటనే సాగర్ జలాలతో నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, వివిధ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు