రమా’ రాజ్యం..!
ఖమ్మం జూన్ 15 (మన జ్యోతి బ్యూరో)
- అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలింపు
ప్రశ్నించిన వారిపై దాడులు…అక్రమ కేసులు
•మంత్రితో లేని చుట్టరికాన్ని చూపుతూ ఆగడాలు
- విషయం తెలిసి మంత్రి తుమ్మల సీరియస్.
తెలంగాణలోనే నెంబర్ 1 మహిళా పారిశ్రామిక వేత్తగా తనకు తానుగా చెప్పుకునే రమాజ్యోతి (బిలీఫ్ హస్పిటల్ వ్యాపార సామ్రాజ్యంతో పాటు దందాల పరంపరను విస్తరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో తన సార్ (ఎస్ఏఆర్) పారాబాయిల్డ్ రైస్ మిల్లుకు అనుసంధానంగా నిర్మించిన గోదాంలను రెండో ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా అనేక అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ‘నా పేరే శివగామి… నామాటే శాసనం’ అనే రీతిలో ఆమె వ్యవహార శైలి ఉందని స్థానికులు చెబుతున్నారే తప్ప కనీసం తనపై ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నారు. ఇదేమంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన స్థలమని బెదిరిస్తున్నారు. ఆయనతో లేని చుట్టరికాన్ని తనకు ఆపాదించుకుంటున్నారు.
అడ్డుచెబితే ‘దండ’న యాత్రే….
తన చర్యలకు, మాటకు అడ్డుచెబితే స్వయంగా రమాజ్యోతే దండనకు దిగుతారనే ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గరపనిచేసే కూలీలుసైతంతనుఇచ్చిందే
నెం.1 మహిళా పారిశ్రామిక వేత్త ఆక్రమణలు
ప్రొక్లెయిన్లు, టిప్పర్లను వినియోగించి మట్టి తవ్వకాలు
తీసుకోవాలి.. ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలి తప్ప కూలీ డబ్బుల కోసం ప్రశ్నిస్తే స్వయంగా దండనకు పూనుకున్న ఉదంతాలు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టి వేధించిన సందర్భాలూ అనేకం. మండలంలోని గుబ్బగుర్తిలో తన ఆక్వాపామ్లో పనిచేసే ఓ కూలీ ఇలాగే డబ్బుల కోసం అడిగాడు. ఇవ్వకపోవడంతో అటుగా వచ్చిన రమాజ్యోతికి చెంద�


