ఖమ్మం, జూన్ 20: గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చింతకాని మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలు ఎంతమంది ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో స్టోర్స్ లో సామాగ్రి నిలువను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. పిల్లల ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రక్తహీనత, బలహీనంగా ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలింతలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పిల్లలతో పాటు నేలపై కూర్చొని, పిల్లలకు గేయాలు పడేలా, గేయాలకు అనుగుణంగా నృత్యం చేసేలా ప్రోత్సహించి, పిల్లలను చైతన్య పరిచారు. కలెక్టర్ పిల్లలతో మమేకమై కొద్దిసేపు సరదాగా గడిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉన్నవారే ఉన్నతంగా ఎదుగుతారని కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ తనిఖీ సందర్భంగా చింతకాని మండల నాయబ్ తహశీల్దార్ వీరభద్రనాయక్, ఎంపిఓ రవీంద్ర ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఆయా తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు