ఖమ్మం జులై 14: వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పాలేరు
ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో సి.సి., బి.టి. రోడ్లుకు శంకుస్థాపన లు చేసిన రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఆదివారం ఖమ్మం రూరల్ మండలలో కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో రూ.28 లక్షల రూపాయలతో సిసి, బిటి రోడ్లకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం
గూడూరుపాడులో 20 లక్షల రూపాయలతో పల్లె దావఖన ప్రారంభించారు. తిరిగి వెళ్లే క్రమంలో వ్యవసాయ కూలీలతో మంత్రి మాట్లాడారు. కూలీలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.రోజు వారి కూలి ఎంత వస్తుందని తెలుసుకోవడం తో పాటు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తమ పిల్లలు చదువులు పూర్తయినా ఉద్యోగాలు రాలేదని కూలీలు ఆయనకు చెప్పడంతో తమ ప్రభుత్వం లో ఉద్యోగాలు ఇస్తున్నామని వారికి ఆయన తెలిపారు. పలువురు కూలీలు కౌలు రైతుల సమస్యలను కూడా శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకురాగా వారికి కూడా న్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు.

కార్యక్రమం లో ఆర్ అండ్ బి ఎస్.ఈ. హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, ఆర్డిఓ గణేష్, పి.ఆర్. ఇఇ వెంకటరెడ్డి, ఎం. శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పలత, వాణిశ్రీ, ఇరిగేషన్ ఇ ఇ వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి ఖమ్మం వారి చే జారీ చేయనైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు