సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

(( ఖమ్మం విఎన్బి స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు ))

  • అధ్యక్ష, కార్యదర్శులుగా తోట కిరణ్, జమ్ముల రాజేష్ రెడ్డి
  • అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా తోట కిరణ్ (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా జమ్ముల రాజేష్ (హెచ్ఎంటీవీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక చెర్రీస్ రెస్టారెంట్ మినీ ఫంక్షన్ హాలులో తాజా మాజీ అధ్యక్షుడు మాదిరాజు సుధాకర్ ఆధ్వర్యంలో పూర్వపు అధ్యక్షులు భీమిశెట్టి రఘు రామారావు (రాము), మొహమ్మద్ షైబుద్ధిన్ (షైబు), చీనేని బాలకృష్ణ (బాలు), రామిశెట్టి లక్ష్మణరావు సమక్షంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కొత్త కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా యనమాల విజయ్, చీపి గంగాధర్, కోశాధికారిగా కాకర్ల జగన్, కొవ్వూరి సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా నల్లటి మోహన్, బండి వేలాద్రి, ప్రచార కార్యదర్శిగా కొత్తపల్లి సుధాకర్ గౌరవ సలహాదారులుగా తడికమళ్ల దేవదానం, నరుకుళ్ల రాము, బల్లెం చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా సుధాకర్, రాము, షైబూ, బాలు, లక్ష్మణరావు వ్యవహరించనున్నారు.
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన తోట కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. పూర్వపు అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకుంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. ఈ సమావేశంలో కొర్ర బాలాజీ జీడిమల్ల శ్రీనివాస్ బండారు ఉమా, గోదా విష్ణు బాజీ, మీరా ఓబిలిశెట్టి రామారావు పాల్గొన్నారు. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, అభినందనలు తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమానికి సహకరిస్తాం

  • సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్

జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని �

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు