ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు

పొలిటికల్ పవర్ న్యూస్ 9 .ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు..

ఫిబ్రవరి 27, 28న మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలు
— పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 20శాతం పెంచాలి
— ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లను అమలు చేయాలి
— మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ

ఖమ్మం, ఫిబ్రవరి 25 : ఈనెల 27, 28న ఖమ్మం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే మాదిగ హక్కుల దండోరా మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగలు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆట-పాటలు, పోరాటాలు ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ పెంచాలి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి లిడ్ క్యాప్ భూములను సంరక్షించి లెదర్ పార్కులు అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను ప్రవేశపెట్టడమే కానీ అమలులో మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. హక్కుల సాధన కోసం ఈనెల 27, 28న జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు ఎస్సీ ఎస్టీలు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువసేన అధ్యక్షులు గొల్లపల్లి నరేష్ కుమార్ మాదిగ, వైరా నియోజకవర్గ ఇంచార్జి సగ్గుర్తి కోటేశ్వరావు మాదిగ, ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జి కనకపుడి వీరస్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు