తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ


ఖమ్మం అక్టోబర్ 6: ఖమ్మం నగరంలోని 2, 3, 36, 41వ డివిజన్ లో రూ.4.69కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
శుక్రవారం ఖమ్మం నగరం లోని 41వ డివిజన్ సీక్వెల్ రోడ్ నందు సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్ ను ప్రారంభించారు. SDF రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. LRS రూ.20 లక్షలుతో నిర్మించిన సీసీ రోడ్స్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. 2వ డివిజన్ LRS, SDF నిధులు రూ.1.10 కోట్లతో సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
3వ డివిజన్ బల్లేపల్లి నందు SDF & LRS నిధులు రూ.1.15కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్స్ మరియు సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 36వ డివిజన్ ట్రంక్ రోడ్ నందు SDF నిధులు రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్స్ మరియు కవర్ స్లాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
గాంధి చౌక్, గోల్డ్ కాంప్లెక్స్ వద్ద LRS నిధులు రూ.24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, పసుమర్తి రాంమోహన్, దండా జ్యోతి రెడ్డి, పగడాల నాగరాజు, వేములపల్లి వెంకటేశ్వరరావు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణా రావు, కొత్త వేంకటేశ్వర రావు, నున్నా మాధవరావు, కోనకంచి ప్రసాద్, నగేష్, నర్రా యల్లయ్య, కుర్రా మాధవ రావు, తోట వీరభద్రం, దొన్వాన్ రవి, కోటి, సుబ్బారావు, సద్దాం స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed