బ్యాంక్ సీఈఓ వీరబాబు గారు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సర కాల పరిమితిలో బ్యాంకును మంచి స్థానంలో ఉంచుటకు శక్తి వంచన లేకుండా పనిచేశానని అభివృద్ధి దిశకు ప్రయాణం చేయుటకు నా వంతు కృషి చేశానని, బ్యాంక్ అధ్యక్షులు మరియు పాలకవర్గ సహకారంతో అధికారులు మరియు ఉద్యోగస్తుల సహకారంతో బ్యాంకును క్రమ పద్ధతిలో నడిపేందుకు కృషి చేశానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించినందుకు బ్యాంక్ అధ్యక్షుల వారికి పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు గారు, డైరెక్టర్లు జనగం కోటేశ్వరరావు గారు, నిర్మల పుల్లారావు గారు, చావా వేణు గారు, వేముల శ్రీనివాసరావు గారు, నూకల సైదులు గారు, కోరం జానికి రావు గారు, ఖమ్మం జిల్లా డిసిఓ K. విజయ కుమారి గారు, ఎస్ డి ఆర్ ఓ ఎస్ డి వెంకటేశ్వర్లు గారు, బ్యాంక్ జిఎం K. నర్మద, A. పద్మావతి డీజిఎంలు, ఏజీఎం లు అధికారులు మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

