ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు జులై 30

ఈ రోజు ఖమ్మం జిల్లా TNGO కార్యాలయం లో
తెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినది. ఈ ఎన్నికల అధికారిగా టి.ఎన్.జి.ఓస్ ఖమ్మం జిల్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ, శ్రీ పెద్దినేని రాధాకృష్ణ గారు వ్యవహరించారు. ఈ ఫోరం అధ్యక్షులుగా శ్రీ డి.రాజకుమార్, కార్యదర్శిగా J. భరత్ రెడ్డి, కోశాధికారి గా CH. లెనిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇరిగేషన్ శాఖ కి సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు 317 సరిగా అమలు కాకపోవడం, స్థానికం గా పదోన్నతులలో అన్యాయం జరగడం వంటి సమస్యలు ఈ ఎన్నిక సందర్భంగా సభ్యులు ప్రస్తావించారు.

నూతనం గా ఎన్నుకున్న కార్యవర్గాన్ని ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు మరియు శ్రీ కొణిదెన శ్రీనివాస్ లు అభినందించారు .
ఈ నాటి ఎన్నిక లో
కార్యవర్గ సభ్యులుగా ch నాగేశ్వర రావు,భీముడు,రవితేజ,గోవిందు,హరిప్రసాద్,శ్రీనివాసులు,కృష్ణ కుమారి,బీబ్సాహెబ్,రాము, శ్రీనివాస్ రావు,రామకృష్ణ,వాసు,అబ్దుల్,యాకూబ్,మదార్ లు ఎన్నికయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు