Category: KHAMMAM

★రఘునాథపాలెం మండలంలో పొలాలకు రాజభాటలు వేసిన మంత్రి పువ్వాడ
◆2కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్న డొంక రోడ్ల నిర్మాణ పనులు
◆హర్షిస్తున్న రైతన్నలు
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్ల రూపురేఖలు మారాయి. మండల వ్యాప్తంగా ప్రధాన రోడ్లు అన్ని ఇప్పటికే సుందరంగా తయారయ్యాయి. 10 సంవత్సరాల క్రితం ఖమ్మం నియోజకవర్గంను చూసి ఇప్పుడు చూసినవాళ్లు అబ్బురపడుతున్నారు. గతంలో కొంత అభివృద్ధి జరిగినా ఇప్పుడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రెండు కోట్ల ప్రత్యేక నిధులతో డొంక రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా మండల ప్రజానీకం, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

వైన్ షాప్ ల దగ్గర జాతర్ల పర్మనెంట్ రూమ్స్ నిబంధనలు ఉల్లంఘన

*జాతర లా పెర్మనెంట్ యదేచ్ఛగా విక్రయాలు *ఉల్లంఘిలా మత్తు.. జాతర్ల పర్మినెంట్.. మద్యం షాపుల వద్ద నిబంధనలకు తూట్లు… మద్యం షాపులలో సరుకు కొని తాగేసి వెళ్లిపోయేందుకు ఉన్న పర్మనెంట్ రూములతో పరేషాన్ పడేసింది. పరిమితికి మించి విస్తరణలో రూములు లోపల…

సకల సౌకర్యాలతో కార్పొరేట్ తీటుగా ప్రభుత్వ విద్య

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ప్రతినిధి వెంపటి నాయుడు సకల సౌకర్యాలతో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ విద్యా.. ▪️విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఆధునీకరణ.. నాణ్యమైన విద్య. ▪️ రూ.16.92 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన…

ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు ఎస్ఆర్ కన్వర్షన్ లో ఏర్పాటు చేయడమైనది

ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు పొలిటికల్ పవర్ న్యూస్ 9 .ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు.. ఫిబ్రవరి 27, 28న మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలు— పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు…

రైతులకు కమిషన్ దారులకి డిష్యూ డిష్ ఖమ్మం మిర్చి మార్కెట్

జిల్లా కేంద్రంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం కమిషన్ దారులు, రైతులు మధ్య వివాదం నెలకొంది. ఈ వారంలో మార్కెట్ కు అధికంగా మిర్చి బస్తాలు వచ్చాయి. శుక్రవారం ఒక క్వింట మిర్చి ధర రూ. 20,800 ఉండగా శనివారం…


అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.
ఖమ్మం జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.
రాజ్యాంగ నిర్మాణకర్త DR.BR అంబేడ్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప స్థాయిలో అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ గారి పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.
Zp చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు, కలెక్టర్ గౌతమ్ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, ఎమ్మెల్సీ తాత మధు గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు
★మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి
స్వతంత్ర సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా VDO’s కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో ఘన నివాళ్ళుర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు, మంత్రి గారి PA రవికిరణ్ గారు,జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ గారు,కార్పొరేటర్లు మక్బూల్ గారు జ్యోతి రెడ్డి గారు,సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ శంషుద్దీన్ ఎండి.మోషన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కుట్టు మెషీన్ లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.
▪️శిక్షణ పొందిన 41 మందికి ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ.
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం సుగ్గలవారి తోట నందు మహిళలకు జన శిక్షన్ సంస్తాన్ వారి అధ్వర్యంలో తరుపున ఉచితంగా శిక్షణ ఇచ్చి 41 మంది మహిళలకు NRI ఫౌండేషన్ మరియు శ్రీ మిత్ర ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన కుట్టు మెషీన్ లను మంత్రి పువ్వాడ చేతుల మీదగా పంపిణీ చేశారు.
స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన కుట్టు మిషన్‌, ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలంటే ముందు వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు టైలరింగ్ మంచి ఉపాధి అని అన్నారు.


టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్..!
▪️మంత్రి పువ్వాడ సూచనలతో మార్చిలో అందుబాటులోకి 16 ఏసీ స్లీపర్ బస్సులు.
▪️కొత్త బస్సును పరిశీలించి, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా సంస్ధ ఎండి ఆరా..
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది.
ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది.
నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.
ఆయా బస్సులను మార్చి నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికే సంస్థకు ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టిఎస్ ఆర్టీసి ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనాతో ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, పరిశీలించారు.
బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
▪️బస్సు ప్రత్యేకతలివే..!
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది.
బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది.
ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.
వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు.
ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి.
అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది.

అభివృధ్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
▪️మల్లేపల్లి, రాములు తండా, బావోజి తండా, జింకల్ తండా, పరికలబొడు తండా గ్రామాల్లో మొత్తం 30 పనులకు గాను రూ.1.13 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో చేపట్టిన 36 పనులకు గాను రూ.1.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
మల్లేపల్లి గ్రామంలో 9పనులకు గాను రూ.26.20 లక్షలు, రాములు తండా గ్రామంలో 5 పనులకు గాను రూ.20 లక్షలు, బావోజి తండా గ్రామంలో 11 పనులకు గాను రూ.33 లక్షలు, జింకల్ తండా గ్రామంలో 9 పనులకు గాను రూ.26.10 లక్షలు, పరికలబొడు తండా గ్రామంలో 2 పనులకు గాను రూ.7.75 లక్షలు మొత్తం పూర్తి అయిన అభివృద్ధి పనులు రూ.1.13 కోట్ల రూపాయల విలువైన సీసీ రోడ్లు, సీసీ కాల్వలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోనే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని, కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో BT, CC రోడ్లతో పాటు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు.

You missed