సందేశ్ కరాటి అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 ను ప్రారంభించిన పల్లా కిరణ్.
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం : గాంధీచౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో బ్లాక్ బెల్ట్ 5 డాన్ కరాటే మాస్టర్ కందాల సందేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థకంగా నిర్వహించిన నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతి వెలిగించి రూబెన్ కట్ చేసి ప్రారంభించారు . మరో విశిష్ట అతిధులు త్రీటౌన్స్ సిఐ సర్వయ్య , వింఫిల్డ్ హై స్కూల్ డైరెక్టర్లు శ్రీకాంత్ , కిషోర్ మరియు కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ హనీ హాసన్ యం. ఇస్మాయిల్ , సౌత్ ఇండియా కరాటే చీఫ్ మహమ్మద్ ఫావద్ సయ్యద్ లు పాల్గొని పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ కీ॥శే॥ కామ్రేడ్ శ్రీ పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు . కరాటే నేర్చుకోవడం వలన మానసిక ఎదుగుదల , శరీర దృడత్వం పెరిగి బలిష్టంగా కనిపిస్తారని అన్నారు . ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అనగా తమను తమ ఆపదలలో రక్షించుకోవడానికి దోహదపడుతుందన్నరు . చిన్ననాటి నుండి పిల్లలు కరాటే అవలంబించడం వలన పిల్లల మనసు ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండి మైండ్ షార్ప్ గా తయారవుతుందన్నారు. హైదరాబాద్ , కోరట్ల , నల్లగొండ , బొంబాయి , మహబూబాబాద్ , కోదాడ , కొత్తగూడెం భద్రాచలం , ఖమ్మం , విజయవాడ , సూర్యాపేట పలు ప్రాంతాలనుండి సుమారుగా 800 మంది పిల్లలు మరియు వివిధ జిల్లాలు , ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్స్లు , అసోసియేషన్ వారు పాల్గొన్నారు .

ByVNB News

Mar 13, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు