Kjammam/20.10.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము

▪️మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు.

▪️విద్యుత్ కాంతులతో అమ్మవారి రధోత్సవము.

▪️ శోబా యాత్ర ను ప్రారంభించి పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు..

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుట్టల బజార్ లొని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవీ మాత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారముతో దర్శనమిచ్చారు.

మహిళా భక్తులచే నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలు ” కార్యక్రమంలో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, వసంత లక్ష్మీ గారు పాల్గొన్నారు.

అనంతరం మేళతాళములతో విద్యుత్కాంతి దీపాల మధ్య అమ్మవారు వెలుగొందారు. అశేష భక్తజన సందోహంతో , మాలధారణ వాసవి మాతలతో నగర సంకీర్తన, మహిళల కోలాట ప్రదర్శనలతో అమ్మవారి రధోత్సవ శోబాయాత్ర ను మంత్రి పువ్వాడ ప్రారంభించి పాల్గొన్నారు.

ఈ శోభాయాత్రలో మేయర్ పునుకొల్లు నీరజ, పగడాల నాగరాజు, వేములపల్లి వెంకన్న బాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , కోశాధికారి కొత్తమాసు హేమ సుందరరావు , ఉపాధ్యక్షులు గోళ్ళ భాస్కరరావు, బిజ్జల ఈశ్వర్ రావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవరశెట్టి పూర్ణచందర్రావు , మద్ది వెంకట వీరభద్రరావు , సహాయ కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసరావు , అనుమోలు రమేష్ , యర్రమళ్ళ సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు