రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ .

బోడేపుడి రాజా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు .

ఖమ్మం : బోడేపుడి రాజా జన్మదిన సందర్భంగా శ్రీనగర్ కాలనీ రోడ్ నెం 1 నందు బోడేపుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కొరకు రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ రక్తదాన శిబిరాన్ని బోడేపుడి ట్రస్ట్ చైర్మన్ బోడేపుడి రాజా కలిసి చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించారు . సుమారుగా 50 మంది దాకా పాల్గొని రక్తదానం చేశారు . నిరుపేద మహిళలకు 500 మందికి చీరలు పంపిణీ చేశారు . అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా బోడేపుడి రాజా ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , పువ్వుల దుర్గాప్రసాద్ , కార్పొరేటర్లు కమ్మర్తపు మురళి , చావనారాయణ తదితరులు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ట్రస్టు ద్వారా పేదలకు మరెన్నో సేవలు అందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో నాగల్ల లక్ష్మణ్ , ఎన్.ఎస్.యు.ఐ లీడర్ సందీప్ , బాధవత్
అనిల్ కుమార్ , సంపత్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు