మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఖమ్మం బ్యూరో వెంపటి నాయుడు మన జ్యోతి

ఖమ్మం, జనవరి 5: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజాపాలన దరఖాస్తులను కట్టుదిట్టంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే అంశంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ రూపోందించిందని, మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఆన్ లైన్ ప్రజాపాలన వెబ్ సైట్ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పించారని, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సదరు దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయడం చాలా కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా ఆన్లైన్లో భద్రపరచాలని కలెక్టర్ అన్నారు. ప్రజాపాలన వెబ్ సైట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు లాగిన్ అందిస్తామని, మండలాలలో అవసరమైన మేర కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం మొదలగు ఏర్పాట్లు చేశామని, వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేయడం ప్రారంభించి ప్రభుత్వం నిర్దేశించిన జనవరి 17 గడువు ఉన్నప్పటికీ, మన జిల్లాలో వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో సంక్రాంతి లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు దరఖాస్తు చేసుకున్న పథకాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ అన్నారు. ఆన్లైన్ ప్రక్రియ సూచించిన కేంద్రాలు, ఎంపిడివో, తహసీల్దార్, మునిసిపల్ కార్యాలయాలు తదితర దగ్గర మాత్రమే చేపట్టాలని ఆయన తెలిపారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం చేసినట్లు, ప్రక్రియను వారి సమక్షంలో చేపట్టాలని, సందేహాలుంటే వారితో నివృత్తి చేసుకోవాలని ఆయన అన్నారు. దరఖాస్తుల్లో ఉన్న వివరాలు నమోదు చేయాలని, యూజర్ ఐడి, లాగిన్ లు గోప్యంగా ఉంచాలని, ఇతరులకు ఇవ్వవద్దని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీవో విద్యాచందన, డిపిఓ హరికిషన్, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు