పోలీస్ కమీషనర్ విష్ణు యస్.వారియర్ కు ఆత్మీయ వీడ్కోలు

బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న పోలీస్ కమీషనర్ విష్ణు యస్. వారియర్ కు ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
నగరంలోని కెఎల్ సి లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, మినిస్ట్రీయల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది హాజరై ఘనంగా సన్మానించారు.
పలువురు పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సర్వ సాధారణమైనప్పటికి
శాంతిభద్రతలు తనదైన శైలిలో పరిరక్షిస్తూ ప్రజలకు దగ్గరయ్యేలా… బాధితులకు అండగా నిలవాలనే ఐడియాలజీతో తాను పనిచేస్తూ..జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం పరుస్తూ విజయవంతంగా ముందుకు నడిపించిన జిల్లా పోలీస్ అధికారి బదిలీ కావటం కొంత బాధాకరమని అన్నారు.
కీలకమైన కేంద్ర సర్వీస్ విభాగానికి వెళ్తున్న పోలీస్ కమిషనర్ మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సిబ్బంది తనపై చూపిన అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పని చేయాలన్నారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, మీ అందరి సహకారాన్ని ఎన్నటికీ మరువలేనని అన్నారు. మరో రెండు రోజుల్లో కేంద్రం సర్వీస్ లోని కీలక విభాగంలో భాధ్యతలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమం ఆనంతరం ఆయనపై పూల వర్షం కురిపిస్తూ పోలీస్ సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు.

అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు గణేష్, హరికృష్ణ, ప్రసన్న కుమార్, భస్వారెడ్డి, రహెమాన్, రామనుజం, శివరామయ్య, రవి,
నర్సయ్య, సుశీల్ సింగ్, ఆర్ ఐలు, సిఐలు, ఎస్సేలు, సెక్షన్ సూపరిండెంట్ జానకీరాం పాల్గొన్నారు. పి ఆర్ వో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు