ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు, ఏదులాపురం, కొండాపురం గ్రామాల్లో నూతన హెల్త్ సెంటర్ భవనాల ప్రారంభోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..
ప్రజాపాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు
మీరందరూ బాగుండాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది..
ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చాము..
ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ లు అమలుచేసాం…
ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులు మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు తెలుసుకున్నారు…
తీసుకున్న అప్లికేషన్లలో ఇచ్చిన మీ కోరికలను పేదవారిలో అతి పేదవారి నుంచి మొదలుకుని అర్హులైన వారందరికీ అందిస్తాం…
గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపి పని చేయకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదు ఇందిరమ్మ ప్రభుత్వం…
ఎన్ని అవాంతరాలు,కష్టాలు ఎదురైన మీకు ఇచ్చిన మాటకు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది..











