సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి..

  • కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి
  • ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శన

ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అనంతం ఆస్పత్రి మెడికల్ సూపరింటెoడెంట్ ఎల్.కిరణ్ కుమార్ ను కలిసి..వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి లోపల అంతా పరిశుభ్రంగా వుంచారని అభినందించారు. ఇలాంటి శ్రద్ధ నే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నాయకులు దుంపల రవి, మంకెన వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు