ఖతీజాబేగంపై చర్యలు తీసుకోవాలి

సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి

ది గాడ్ థెరిస్సా మహిళా మండలి సభ్యురాలు నాగరాణి, ఉమ

ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 5 )) వెంపటి నాయుడు

ఎగ్జిక్యూటీవ్ కమిటీకి సంబంధం లేని వ్యక్తిని సంస్థ ట్రెజరర్‌గా నియమించి ఖాతాను ఓపెన్ చేసి ఐదేళ్లుగా మోసం చేస్తున్న ది గాడ్ థెరిస్సా మహిళా మండలి అధ్యక్షురాలు ప్రెసిడెంట్ ఖతీజాబేగంపై చర్యలు తీసుకోవాలని మహిళా మండలి సభ్యురాలు నాగరాణి , ఉమ డిమాండ్ చేశారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంస్థలో జరుగుతున్న మోసాలపై తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి , జిల్లాలోని డిఏపిసియుకు , కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు . దీనిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని , ఈ కేసును ఇల్లందు సిఐకి బదిలీ చేశారని తెలిపారు . కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఇప్పుడు సంస్థకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ కార్యవర్గ సభ్యులకు తెలియకుండా ప్రెసిడెంట్ ఏకపక్ష నిర్ణయంతో ఎన్నికల నోటీసులను జారీ చేశారని పేర్కొన్నారు . సంస్థలో జరుగుతున్న అన్యాయాలు , ఆర్థిక లావాదేవీలకు మణుగూరు ప్రాజెక్టు మేనేజర్ సాగర్ రెడ్డి , ఖమ్మం డిపిఎం సత్యకుమార్ అండదండలున్నట్లు ఆరోపించారు . ఫోర్జరీ సంతకం చేశానని తప్పును అంగీకరించి లెటర్ రాసి ఇచ్చి ఖతీజాబేగం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలని తెలిపారు . వెంటనే ఆమెపైనా , ఆమెకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ మీడియా సమావేశంలో సంస్థ సభ్యులు పద్మ , రాణి , రమ , లక్షీ , సంజన తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు