వక్ఫ్ భూములను పరిరక్షించాలి

ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 5 ))

ఖమ్మంలోని వెలుగుమట్ల శివారు గొల్లగూడెం గ్రామ పరిధిలో ఈద్గా , ఖబరస్తాన్‌తో పాటు వీటిపక్కనున్న సర్వే నెంబర్ 431, 432 , 425 సర్వే నెంబర్లలోని సుమారు 350 కోట్ల విలువ చేసే వక్ఫ్ భూమిని కొంతమంది ప్రయివేట్ భూమిగా చూపిస్తూ జిల్లా అధికారుల అండతో కాజేస్తున్నారని ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్ ఆరోపించారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
వారు మాట్లాడుతూ ముస్తాఫానగర్‌లో సర్వే నెంబర్ 481 , 482 , 483 , 484 , 485 లలో సుమారు 15 ఎకరాల 24 కుంటల భూమి ఉందని , వీటికి సంబంధించిన ముతవల్లీలు , వారి వంశీకులు కలిసి అక్రమంగా అమ్ముకున్నారని తెలిపారు . అలాగే వెలుగుమట్ల రెవెన్యూ గొల్లగూడెం పరిధిలో మొత్తం 72.29 కుంటల భూమి ఉందని అన్నారు . ఈ భూములలో ముస్లింల ప్రార్థనా స్థలం , ఖబరస్తాన్ ఉన్నయని , వీటికి ఎలాంటి నష్టం జరిగినా ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు . వెలుగుమట్ల రెవెన్యూలోని 431 సర్వే నెంబర్ సుమారు 12 ఎకరాల 34 కుంటల భూమి ఉందని , దీనిలో 4 ఎకరాల 11కుంటల భూమిని వక్ఫ్ భూమి కాదని వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ ఆడిటర్ ఎన్‌ఓసి ఆర్డర్ రాసి ఇచ్చారని చెప్పి అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు . వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ కనసైగలతో సర్వే నెంబర్ 425లో ఓ బిల్డర్ భవనాన్ని నిర్మించారని తెలిపారు . ఈ విషయమై కలెక్టర్‌కు , మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఆధారాలు సమర్పించామని అన్నారు . వెంటనే ఈ భూమిని ఆక్రమణ
దారుల నుండి కాపాడాలని కోరారు . ఈ సమావేశంలో నసీమా ఆర్సి , తరుణం ఫాతిమా , రఫియా , జరీనా , అనీఫా , ఆఫ్రిన్ , మెహ్రజ్ , ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు